పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు. పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.
గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది. గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
💥లఘువులు💥
ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు. (మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ఆ,ఇ,ఉ,ఎ,ఒ
👉 హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - క,చి,టు,తె,పొ
👉 హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త
మెదలయునవి
👉 హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
👉 వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి
💥గురువులు💥
ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.
👉 దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ఆ,ఈ,ఊ,ఏ,ఓ,ఐ
👉 ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ
👉 విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - త:,దు:,అ:
👉 సున్నా (ం) కూడిన అక్షరాలు అన్నీ గురువులు.
ఉదా - అం,కం,యం,రం
👉 సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
👉 ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
👉 పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ఖ,ఘ,ఛ,ఝ
0 Comments