సీపీఐ సీనియర్ నేత బర్దన్ మృతి
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సీనియర్ నాయకులు ఎబీ బర్దన్ (91) జనవరి 2న న్యూఢిల్లీలో మరణించారు. బర్దన్ 1996 నుంచి 2012 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1957లో నాగ్పూర్ నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బర్దన్ కార్మిక నేతగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
అద్నాన్ సమీకి భారత పౌరసత్వం పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు జనవరి 1 నుంచి అద్నాన్ సమీకి భారత పౌరసత్వం లభించింది. పాక్లోని లాహోర్లో జన్మించిన అద్నాన్ 2001 నుంచి వీసాపై భారత్ను సందర్శిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా భారత్లోనే నివసిస్తున్నారు.
సీఐసీగా మాథూర్ ప్రమాణస్వీకారంకేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఆర్కే మాథూర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. త్రిపుర కేడర్కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథూర్ గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన రానున్న మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.
ఎస్ఎంఈ చాంబర్స్ సలహాదారుగా అజయ్కుమార్ అగర్వాల్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్ఎంఈ చాంబర్స్కు సలహాదారుగా ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ డెరైక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ముంబై కేంద్రంగా 45 వేల ఎస్ఎంఈ సంస్థలు సభ్యులుగా 22 ఏళ్ల నుంచి ఎస్ఎంఈ చాంబర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంఈ)ను పటిష్టం చేయడం, మంచి వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్ఎంఈ చాంబర్స్ తగిన ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వ్యవహరించిన అజయ్ కుమార్ అగర్వాల్... ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డ్ను, యూనిటీ తదితర అవార్డులను అందుకున్నారు.
సిరాజ్కు ఎన్జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జనవరి 4న విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరాజ్కు గౌరవ డాక్టరేట్ను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టరు అల్లూరి పద్మరాజు ప్రదానం చేశారు. సిరాజ్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తూ మార్కెట్ల బలోపేతంతోనే వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని, ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవంతో ఆహారోత్పత్తి పెరిగినా ఆహార సరఫరా సరైన రీతిలో జరగడం లేదన్నారు. 2030 నాటికి దేశ జనాభా 145 కోట్లకు చేరవచ్చని, అప్పటికి 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు, 32 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు.
విప్రో సీఈవోగా అబిద్ అలీదిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ ఫిబ్రవరి నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ నుంచి నీముచ్వాలా విప్రోలో తన కెరీర్ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు. ఈయన గ్లోబల్ ఇన్ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్గా ఉన్నారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తొలిసారిగా ఓ మహిళా వైస్ చాన్సలర్ నియమితులయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న లూయిస్ రిచర్డ్సన్(56) ఈ ఘనత సాధించారు. జనవరి 1న ఆమె ఆక్స్ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐర్లాండ్లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్మోర్లో ఆమె జన్మించారు. డబ్లిన్లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అందులోనే రాడ్క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్గా పనిచేశారు. 2009లో బ్రిటన్లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్గా బాధ్యతలు చేపట్టారు.
అద్నాన్ సమీకి భారత పౌరసత్వం పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీకి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు జనవరి 1 నుంచి అద్నాన్ సమీకి భారత పౌరసత్వం లభించింది. పాక్లోని లాహోర్లో జన్మించిన అద్నాన్ 2001 నుంచి వీసాపై భారత్ను సందర్శిస్తున్నారు. ఆయన గత కొన్నేళ్లుగా భారత్లోనే నివసిస్తున్నారు.
సీఐసీగా మాథూర్ ప్రమాణస్వీకారంకేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఆర్కే మాథూర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. త్రిపుర కేడర్కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారైన మాథూర్ గతంలో రక్షణశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆయన రానున్న మూడేళ్లు పదవిలో కొనసాగుతారు.
ఎస్ఎంఈ చాంబర్స్ సలహాదారుగా అజయ్కుమార్ అగర్వాల్తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్ఎంఈ చాంబర్స్కు సలహాదారుగా ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ డెరైక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ముంబై కేంద్రంగా 45 వేల ఎస్ఎంఈ సంస్థలు సభ్యులుగా 22 ఏళ్ల నుంచి ఎస్ఎంఈ చాంబర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంఈ)ను పటిష్టం చేయడం, మంచి వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్ఎంఈ చాంబర్స్ తగిన ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వ్యవహరించిన అజయ్ కుమార్ అగర్వాల్... ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డ్ను, యూనిటీ తదితర అవార్డులను అందుకున్నారు.
సిరాజ్కు ఎన్జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్కేంద్ర వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జనవరి 4న విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరాజ్కు గౌరవ డాక్టరేట్ను వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టరు అల్లూరి పద్మరాజు ప్రదానం చేశారు. సిరాజ్ స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తూ మార్కెట్ల బలోపేతంతోనే వ్యవసాయానికి ప్రోత్సాహం లభిస్తుందని, ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. దేశంలో హరిత విప్లవంతో ఆహారోత్పత్తి పెరిగినా ఆహార సరఫరా సరైన రీతిలో జరగడం లేదన్నారు. 2030 నాటికి దేశ జనాభా 145 కోట్లకు చేరవచ్చని, అప్పటికి 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు, 32 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు.
విప్రో సీఈవోగా అబిద్ అలీదిగ్గజ టెక్నాలజీ కంపెనీ విప్రో సీఈవోగా అబిద్ అలీ నీముచ్వాలా నియమితులయ్యారు. ఇంతవరకు కంపెనీ సీఈవోగా వ్యవహరించిన టీకే కురియన్ విప్రో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పదోన్నతి పొందారు. వీరిద్దరూ ఫిబ్రవరి నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. టీసీఎస్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2015 ఏప్రిల్ నుంచి నీముచ్వాలా విప్రోలో తన కెరీర్ను గ్రూప్ ప్రెసిడెంట్, సీవోవో స్థాయి నుంచి ప్రారంభించారు. ఈయన గ్లోబల్ ఇన్ఫ్రా సర్వీసెస్, బిజినెస్ అప్లికేషన్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ వంటి సర్వీసెస్ లైన్స్ హెడ్గా ఉన్నారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తొలి మహిళా వీసీప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తొలిసారిగా ఓ మహిళా వైస్ చాన్సలర్ నియమితులయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రత అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న లూయిస్ రిచర్డ్సన్(56) ఈ ఘనత సాధించారు. జనవరి 1న ఆమె ఆక్స్ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐర్లాండ్లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్మోర్లో ఆమె జన్మించారు. డబ్లిన్లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. అనంతరం పీహెచ్డీ చేశారు. 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. అందులోనే రాడ్క్లిఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీకి ఏడున్నరేళ్లు ఎగ్జిక్యూటివ్ డీన్గా పనిచేశారు. 2009లో బ్రిటన్లోని సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్గా బాధ్యతలు చేపట్టారు.

0 Comments